BJP : నేడు బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది

Update: 2024-07-08 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు.

రాజమండ్రిలో...
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పార్టీని రాష్ట్రంలో ఎలా బలోపేతం చేయాలన్న దానిపై నేడు నేతలు చర్చించున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేేసే దిశగా చర్యలపై పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మురుగన్, శ్రీనివాసవర్మతో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్, పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News