Chandrababu : ఐదు కోట్ల రూపాయలను ప్రకటించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారు

Update: 2024-07-19 06:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు ఐదు కోట్ల రూపాయలు ప్రకటించారు. నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు వచ్చిన భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ తో మాట్లాడారు.

రొట్టెల పండగ కోసం...
నెల్లూరులో రొట్టెల పండగ నేటికి మూడో రోజుకు చేరుకుంది. రొట్టెల పండగ నిర్వహణ కోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అందరి విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదు కోట్ల రూపాయలతో దర్గా వద్ద అభివృద్ధి పనులతో పాటు భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Tags:    

Similar News