Nara Lokesh: నేడు గన్నవరానికి లోకేశ్.. అశోక్ లేల్యాండ్ కంపెనీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు;

Update: 2025-03-19 03:15 GMT
nara lokesh, minister, ashok layland, gannavaram constituency
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో ఉన్న మల్లపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ లో అశోక్ లేలాండ్ పరిశ్రమను లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ కంపెనీ రాకతో తొలి దశలో పన్నెండు వందల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

వేలాది మందికి...
పరోక్షంగా వేలాది మందికి ఉపాధికి అవకాశం కలుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్ లోనూ ఈ కంపెనీ విస్తరించి మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెబుతున్నారు.గన్నవరం పర్యటనకు లోకేశ్ వస్తున్న సందర్భంగా టీడీపీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. భారీ స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News