Chandrababu అప్పట్లో చంద్రబాబును కొట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు క్లాస్మేట్స్ అని, అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని

Update: 2024-07-27 02:29 GMT

సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు క్లాస్మేట్స్ అని, అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని అన్నారు. అందుకే చంద్రబాబుకు పెద్దిరెడ్డి అంటే అంత కోపమని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. అప్పుడెప్పుడో జరిగిన ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు, ఇప్పటికీ పెద్దిరెడ్డిపై కక్షతో రగిలిపోతున్నారని.. పెద్దిరెడ్డి కుటుంబాన్ని నాశనం చేసి, ఆయనపై పగ తీర్చుకోవాలని చూస్తున్నారని జగన్ వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 7సార్లు ఎమ్మెల్యే.. ఆయన కొడుకు మిథున్ రెడ్డి మూడుసార్లు ఎంపీ అని అన్నారు. వారికి మంచి పేరు ఉంది కాబట్టే వారిని ప్రజలు ప్రతి సందర్భంలో గెలిపిస్తున్నారన్నారు. పెద్దిరెడ్డి ఇళ్ల మీద వాళ్లే దాడులు చేస్తారు.. సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే వాళ్లే దాడులు చేసి తిరిగి కేసులు వీళ్ల మీద పెడతారన్నారు. మిథున్ రెడ్డి కారును పగలగొట్టి మళ్లీ మిథున్ రెడ్డి మీదనే కేసు పెట్టారని ఆరోపించారు వైఎస్ జగన్.

వినుగొండలో రషీద్ దారుణ హత్య‌ను ఖండిస్తూ తాను వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే.. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం అదే రోజు మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్ర అంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. సీఐడీ చీఫ్‌ను, డీజీపీని హుటాహుటిన మదనపల్లెకు హెలికాప్టర్‌లో పంపారని విమర్శించారు.


Tags:    

Similar News