Tirumala : శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందిగా?

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది

Update: 2024-08-02 03:18 GMT

తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది. ప్రతి శుక్ర, శని, ఆదివారాలు అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. శుక్రవారం తిరుమలకు చేరుకుని శనివారం స్వామి వారిని దర్శించుకోవడానికి ఎక్కువ మంది భక్తులు సుముఖత చూపుతారు. శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే శుభప్రదమని నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అందుకే వారంలో మూడు రోజుల పాటు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగినట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఎలాంటి ఇబ్బందుుల పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుంది.

పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 61,465 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,206 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News