Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఇలానా? ఆదివారం కూడా

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Update: 2024-10-27 03:31 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ అంతగా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారీ వర్షాలు లేకపోయినా, తుపాను వెళ్లిపోయినా, రైళ్లన్నీ తిరిగి మళ్లీ పట్టాలెక్కినా భక్తులు మాత్రం తిరుమలకు పెద్దగా రాలేదు. ఎక్కువ మంది తిరుమలకు ఆదివారం రాకపోవడంతో వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. ప్రధానంగా మాడవీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కంపార్ట్‌‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వసతి గృహాలకు కూడా డిమాండ్ లేదు. భక్తుల సంఖ్య సండే కూడా సంఖ్య తక్కువగా ఉండటం నిజంగానే ఇదే ప్రధమమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటున్నారు. అయితే దీపావళి పండగ ఉండటంతో వరస సెలవులు వస్తుండటంతో ఇకపై తిరుమలలో రద్దీ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీపావళి ఆస్థానం కూడా జరపనున్నారు. తిరుమల శ్రీవారి సేవలలో పాల్గొనేందుకు దీపావళి పర్వదినాల సమయంలో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటారని భావిస్తున్నారు.

కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీ....
తిరుమలలో భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో అధికారులు కూడా లడ్డూల తయారీ సంఖ్యను తగ్గించారు. ఎక్కువ లడ్డూలు తయారు చేస్తే మళ్లీ పాడయి పోయే అవకాశముందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు లేక ఖాళీగా ఉన్నాయి. తిరుమల శ్రీవారిని నేరుగా దర్శించుకునే వీలుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఈరోజు ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుందని, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటలలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,844 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,418 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News