Pawan Kalyan : ఆ అధికారులకు పవన్ వార్నింగ్ .. మామూలుగా లేదుగా

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు

Update: 2024-06-20 07:11 GMT

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షలు చేస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఎదురుకాకుండా చూడాలని ఆయన నిన్న జరిపిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సమీక్షలతో...
ఈరోజు ఉదయం 10 గం. నుంచి శాఖాపరమైన సమీక్షలను ఉపమఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. తొలుత ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో సమీక్ష మొదలయింది. వరస సమీక్షలు చేస్తూ ఆ శాఖలో అధికారులక టైం బౌండ్ కార్యక్రమాలను నిర్దేశిస్తున్నారు. మూడు నెలల తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటే ఉపేక్షించనని కూడా పవన్ హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News