Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.

Update: 2024-08-09 03:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. రేపు శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా శుక్రవారమే భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలకు భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు సాధారణ భక్తులు కూడా కొండకు చేరుకోవడంతో తిరుమలకు భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. శనివారం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని, శుభప్రదమని భావించి ఎక్కువగా ఈరోజుల్లో తిరుమలకు వస్తుంటారు.

31 కంపార్ట్‌మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,335 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి తిరుమలకు భక్తుల రాక మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News