Rk Roja : రుషికొండ భవనంపై రోజా రెస్పాన్స్.. బెంజి కారంటూ టీడీపీ ఎమ్మెల్యే బౌన్సర్

రుషికొండలో నిర్మించిన భవనపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే నిర్మించామన్నారు

Update: 2024-06-19 06:57 GMT

రుషికొండలో నిర్మించిన భవనపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల అనుమతులతోనే ఆ భవనాన్ని నిర్మించామని ఆర్కే రోజా గుర్తు చేశారు. ఆ భవనం నిర్మాణం అత్యద్భుతంగా జరిగిందని ఆమె ట్వీట్ చేశారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ భవనాన్ని నిర్మించడం తప్పా అని రోజా ప్రశ్నించారు. రుషికొండ భవనాన్ని చూసి ఓర్వలేని కొందరు ఆ భవన నిర్మాణాలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

బెంజికారు కథేంటంటూ...
వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం నిర్మించిన వారికి ఈ భవనం చూసి కళ్లు కుడుతున్నాయని ఆమె అన్నారు. ఈ భవనాల నిర్మాణాలకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులిచ్చిందని చెప్పారు. మరోవైపు నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. రోజా బెంజ్ కారు సంగతి కూడా చెప్పాల్సిందని తెలిపారు. ఈ భవనానికి, బెంజ్ కారుకు ఉన్న లింకేమిటంటూ ఆయన ప్రశ్నించి మాజీ మంత్రి ఆర్కే రోజాకు కౌంటర్ ఇచ్చారు.


Tags:    

Similar News