సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి నేడు నోటీసులు ఇచ్చారు

Update: 2024-10-16 07:01 GMT

sajjala ramakrishna reddy

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి నేడు నోటీసులు ఇచ్చారు. నోటీసులు మంగళగిరి రూరల్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు.రేపు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు హాజరుకావాలని నోటీసులు జారీ చేయడంతో ఆయన రేపు హాజరు కానున్నారు.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో...
టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతల నేతృత్వంలో కార్యకర్తలు దాడిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఇటీవల ప్రభుత్వం సీఐడీకి కూడా బదిలీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. మరికొందరు న్యాయస్థానం నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు మంగళగిరి పోలీసులు జారీ చేశారు.


Tags:    

Similar News