Ys Jagan : నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష

నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుంది

Update: 2024-01-02 01:58 GMT

Second phase of jagananna arogya suraksha programme

నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుంది. నేటి నుంచి గ్రామాల్లో వైద్య శిబిరాలు మొదలు కానున్నాయి. రేపటి నుంచి పట్టణాలు, నగరాల్లో ఈ శిబిరాలు ప్రారంభమవుతాయి. మొత్తం ఆరు నెలల్లో 13,954 శిబిరాలను నిర్వహించాలని జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శిబిరానికి ముగ్గురు వైద్యులను పంపి వారితో పరీక్షలు చేయించి జబ్బులకు సంబంధించి ప్రిస్కిప్షన్ అందచేయనున్నారు. సంక్రాంతికి ముందే ఈ శిబిరాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఏడురకాల కిట్ల ద్వారా...
ఈ శిబిరాల ద్వారా గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి వైద్యసేవలను అందించనున్నారు. మొత్తం అరవై లక్షల మందికి వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆరో్గ్య శిబిరాలకు రావాలని సూచిస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో మొత్తం ఏడు రకాల మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని అక్కడికక్కడే సూచించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ కార్కక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు కార్యక్రమం అమలు తీరుపై సమీక్షలు నిర్వహిస్తుండటంతో వైద్యులు గ్రామాలకు బయలుదేరి వెళ్లారు.


Tags:    

Similar News