యువశక్తి సభలో లాఠీఛార్జి

శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో తోపులాట జరిగింది. పవన్ కల్యాణ్ వేదిక పైకి వచ్చిన కార్కకర్తలు ముందుకు తోసుకువచ్చారు.

Update: 2023-01-12 11:47 GMT

శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో తోపులాట జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేదిక పైకి వచ్చిన వెంటనే కార్కకర్తలు ముందుకు తోసుకువచ్చారు. బారికేడ్లను తోసుకు వచ్చేందుకు అభిమానులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్టీ కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేశారు.

పోలీసులపై తిరగబడటంతో...
కార్యకర్తలను పలుమార్లు ఆగాలని చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఓ కార్యకర్త ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల మీద కార్యకర్తలు తిరగబడ్డారు. గాయపడిన కార్యకర్తకు చికిత్స అందించేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కార్యకర్తలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.


Tags:    

Similar News