Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ .. రీజన్ ఇదే

తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

Update: 2024-05-11 05:29 GMT

తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రతి శని, ఆదివారాలు తిరుమలకు భక్తుల తాకిడికి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రోజుల్లో స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శనివారం స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని భావించి తిరుమలకు వస్తుంటారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

శనివారం కావడంతో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 60,545 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,527 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయయం 2.53 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


Tags:    

Similar News