ఏపీ వైపు వస్తే భారీ వర్షాలే..!

పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీద ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని

Update: 2023-07-31 01:52 GMT

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది వేగంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, విశాఖకు దగ్గర్లో ఈ అల్పపీడనం ఉంది. దీని ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మూడు రోజులు వర్షాలు ఉన్నాయని అంటున్నారు. ఈ అల్పపీడనం ప్రభావం మంగళ, బుధవారాల నుంచి కనిపిస్తుందని అంటున్నారు.

IMD సూచన ప్రకారం.. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీద ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ అల్పపీడనం మయన్మార్ వైపు నుంచి ఏపీ వైపుగా కదులుతోంది. ఏపీ వైపు వస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వానలు పడతాయంటున్నారు.
తెలంగాణలో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావణశాఖ అంచనా వేస్తోంది. మంగళవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది.


Tags:    

Similar News