దువ్వాడ, మాధురికి నోటీసులు

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, మాధురికి తిరుమల వన్ టౌన్ పోలీసులు నోటీసులు అందచేశారు.

Update: 2024-10-20 05:40 GMT

duvvada srinivas and madhuri

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు తిరుమల వన్ టౌన్ పోలీసులు నోటీసులు అందచేశారు. విచారణకు రావాలని ఇద్దరికీ 41 ఎ కింద నోటీసులు జారీ చేయడానికి తిరుమల నుంచి టెక్కలికి బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనవాసరావుతో పాటు మాధురికి కూడా ఈ నోటీసులు అందచేయనున్నారు.

రీల్స్ చేయడంపై...
దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇటీవల తిరుమలకు వచ్చినప్పుడు రీల్స్, ఫొటో షూట్ చేయడమే కాకుండా, తిరుమల కొండపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లి ఆ సమయంలో ఈ చర్యలకు దిగిన ఇద్దరికీ నోటీసులు ఇవ్వనున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణకు రావాలని నోటీసులు అందచేయనున్నారు.


Tags:    

Similar News