Petrol-Diesel Prices: అధికారంలోకి వచ్చిన వెంటనే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం..;

Update: 2024-03-23 10:50 GMT
Petrol Price

Petrol Price

  • whatsapp icon

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం ప్రారంభించాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో అధికార పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది.

డీఎంకే తన మ్యానిఫెస్టోలో పెట్రోలు, డీజిల్ ధరలపై భారీ ప్రకటనలు చేసింది. డీఎంకే తమ పార్టీ ఎక్కువ సీట్లు గెలిస్తే తమిళనాడులో పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్య స్థాయికి వెళ్తాయని అంటున్నారు. పెట్రోల్ కొత్త ధర 75 రూపాయలు ఉంటుందని డీఎంకే తెలిపింది. డీజిల్ ధర 65 రూపాయలకు తగ్గించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే, పెట్రోల్ ధర లీటరుకు 25 రూపాయల కంటే ఎక్కువ తగ్గుతుంది. డీజిల్ ధర 27 రూపాయలకు పైగా తగ్గనుంది. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద మెట్రోల్లో ఒకటైన తమిళనాడు రాజధాని చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.100.75గా ఉంది. డీజిల్ ధర లీటరు రూ.92.34.

ఇటీవల, దాదాపు రెండేళ్ల తర్వాత దేశంలోని పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను 2 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీని తర్వాత చెన్నై సహా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గాయి. ఇంతకుముందు, పెట్రోలియం కంపెనీలు ఏప్రిల్ 2022 లో పెట్రోల్, డీజిల్ ధరలను మార్చాయి. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్ను తగ్గించింది. 

Tags:    

Similar News