12 మంది సజీవ దహనం.. రాజకీయ ప్రతీకారమా ?

అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో ..

Update: 2022-03-22 13:30 GMT

బీర్బూమ్ : బెంగాల్ లో మరో దారుణం జరిగింది. బీర్బూమ్ జిల్లాలో ఇండ్లకు నిప్పు పెట్టడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులున్నట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్(TMC) నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారన్న ఆరోపణలు వస్తున్నారు. ప్రముఖ వార్తా సంస్థ ANI ప్రకారం, గత రాత్రి సుమారు 10-12 ఇళ్లకు నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోయి 12 మంది చనిపోగా. మరో 38 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమవ్వగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పంచాయితీ నాయకుడు బదు షేక్ హత్యకు గురికాగా, ఆ హత్యకు ప్రతీకారంగా నిప్పంటించే ఘటన జరిగింది. బీర్‌భూమ్‌లో జరిగిన రాజకీయ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు. సీఐడీ ఏడీజీ జ్ఞానవంత్ సింగ్, పశ్చిమ రేంజ్ ఏడీజీ సంజయ్ సింగ్, డీఐజీ సీఐడీ ఆపరేషన్ మీరజ్ ఖలీద్‌లకు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. 'రాంపూర్‌హాట్‌లో అగ్నిప్రమాదానికి రాజకీయాలకు సంబంధం లేదని కొట్టిపారేశారు.


Tags:    

Similar News