వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

Update: 2022-11-08 03:22 GMT

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వర్థన్నపేట మండలం డీసీ తండా వద్ద ఈ ఘటన జరిగింది. ఒంగోలు నుంచి వరంగల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.

ఒంగోలు నుంచి...
ఆగి ఉన్న లారీని ఇన్నోవా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయి మరణించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News