కొంచరియలు విరిగి పడి ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాధ్ కు వెళ్లే దారిలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మరణించారు

Update: 2024-07-21 08:13 GMT

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాధ్ కు వెళ్లే దారిలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో నడక మార్గంలో కేదార్‌నాధ్ వెళుతున్న భక్తులు ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.

నడక మార్గంలో...
ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలి నడకన వెళ్లే ఈ దారిలో పెద్ద పెద్ద రాళ్లు పడటంతో వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ ఘటనతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


Tags:    

Similar News