నడి కుడి రైల్వే స్టేషన్ లో దోపిడీ

నడికుడి రైల్వే స్టేషన్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. 89 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.

Update: 2022-03-08 02:29 GMT

నడికుడి రైల్వే స్టేషన్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. 89 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైల్వే స్టేషన్ కు వచ్చారు. వారు చెన్నై వెళ్లేందుకు రెండో నెంబరు ప్లాట్ ఫారం పై వేచి చూస్తున్నారు. ఎస్ 6 బోగీ ఆగే చోట ఈ ముగ్గురు వెయిట్ చేస్తున్నారు.

పోలీసులు రమ్మంటున్నారంటూ....
ఇది గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులు రమ్మంటున్నారంటూ వారిని బయటకు తీసుకెళ్లారు. ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి చితక బాదారు. వారి వద్ద ఉన్న 89 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. వ్యాపారం కోసం ఈ నగదును చెన్నై తీసుకెళుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Tags:    

Similar News