కారుతో వ్యక్తిని ఢీకొట్టిన పోలీసు ఉన్నతాధికారి కుమార్తె.. బాగా మేనేజ్ చేస్తున్న పోలీసులు

Update: 2022-10-22 01:56 GMT

ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె అయిన ఒక మహిళ ఓ వ్యక్తిని ఢీకొట్టింది. అయినా కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో ఢిల్లీలోని ఓ సిటీ మాల్ వెలుపల తన కారుతో పార్కింగ్ అటెండెంట్‌ను ఢీకొట్టిందని ఆరోపించారు. ఈ ఘటన అక్టోబర్ 16 సాయంత్రం సాకేత్‌లోని సెలెక్ట్ సిటీ మాల్ వెలుపల జరిగినట్లు నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైందని దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ చందన్ చౌదరి తెలిపారు.

అక్టోబర్ 16వ తేదీ రాత్రి 9.35 గంటల ప్రాంతంలో తాను కస్టమర్‌కు కారును అప్పగిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని, అకస్మాత్తుగా పార్కింగ్ నుండి కారు వచ్చి గుద్దిందని బాధితుడు గురువారం సాకేత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని కాలికి గాయమైందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. "అతన్ని మాక్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు," అని పోలీసు అధికారి తెలిపారు ఫిర్యాదు అందిన తర్వాత, భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 279 (బహిరంగ మార్గంలో ర్యాష్ డ్రైవింగ్ లేదా రైడింగ్) మరియు 337 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చర్య ద్వారా గాయపడటం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ," అని అధికారి తెలిపారు.
పార్కింగ్ అటెండర్ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 34 ఏళ్ల మహిళపై కేసు నమోదు చేయబడింది, అయితే ఆమెను ఇంకా అరెస్టు చేయలేదు. ఒక పార్టీకి హాజరైన తర్వాత మహిళ మాల్ నుండి బయటకు వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నతాధికారి బంధువు ప్రమేయం ఉన్నందున పోలీసులు నాలుగు రోజుల పాటు కేసును మేనేజ్ చేసేందుకు ప్రయత్నించారని వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News