మేడపై పడుకున్నందుకు.. కూతుర్ని 25 సార్లు పొడిచి..

తండ్రి దాడి నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న ఇంట్లోకి ప్రవేశించగా.. ఆమెను వెంబడించి మరీ హత్య చేశాడు. ఆపై భార్యను కూడా

Update: 2023-05-31 12:14 GMT

కన్నతండ్రి కసాయిలా మారాడు. మేడపై పడుకుందామన్న భార్యతో గొడవపడి.. అడ్డొచ్చిన కూతుర్ని విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హతమార్చాడు. మే 18వ తేదీన సూరత్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సూరత్‌లోని సత్య నగర్ సొసైటీలోని ఓ ఫ్లాటులో రామానుజ అనే వ్యక్తి భార్య, కూతురు (19)తో కలిసి అద్దెకు ఉంటున్నాడు. వేసవి కాలం కావడంతో ఇంటి డాబాపై పడుకుందామని భార్య అడిగింది. ఈ విషయమై భార్యభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర కోపోధ్రిక్తుడైన రామానుజ రాత్రి 11.20 గంటల సమయంలో కత్తితో భార్యపై దాడికి దిగాడు. అడ్డొచ్చిన కూతురిని అత్యంత దారుణంగా 25 సార్లు పొడిచి చంపాడు.

తండ్రి దాడి నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న ఇంట్లోకి ప్రవేశించగా.. ఆమెను వెంబడించి మరీ హత్య చేశాడు. ఆపై భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఇరుగు పొరుగు వారు అతడిని ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి దిగాడు. దాంతో ఎవరూ అతని వద్దకు వెళ్లే ధైర్యం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వగా.. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రామానుజను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి హత్యకు వినియోగించింన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.







Tags:    

Similar News