గుజరాత్ లో కూలిన భవనం.. ఏడుగురు మృతి

గుజరాత్ లోని సూరత్ లో భారీ వర్షాలకు ఘోర ప్రమాదం జరిగింది. ఐదంతస్థుల భవనం కూలడంతో ఏడుగురు మరణించారు.

Update: 2024-07-07 04:09 GMT

గుజరాత్ లోని సూరత్ లో భారీ వర్షాలకు ఘోర ప్రమాదం జరిగింది. ఐదంతస్థుల భవనం కూలడంతో ఏడుగురు మరణించారు. సూరత్ సమీపంలోని సచిన్ పాలి గ్రామంలో ఐదంతస్థుల భవనం కూలింది. భారీ వర్షాలకు ఈ భవనం కూలింది. పురాతన భవనం కావడంతో ఎవరూ అక్కడ నివాసం ఉండటం లేదు. ఐదు కుటుంబాలకు చెందిన కూలీలు మాత్రమే ఉన్నారు.

భారీ వర్షాలకు...
ఈ ప్రమాదంలో కొందరు గాయపడ్డారు. వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని చర్యలు చేపట్టాయి. ఇల్లు పురాతనమైనది కావడంతో భారీ వర్షాలకు కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో భారీ వర్షాలకు పురాతన భవనాలలో ఉన్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.


Tags:    

Similar News