నెల్లూరులో దారుణం.. మర్మావయవాలు తొలగించి?

నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. ట్రాన్స్‌జెండర్ కు బీఫార్మసీ విద్యార్థులు ఆపరేషన్ చేయడంతో మృతి చెందిన సంఘటన జరిగింది

Update: 2022-02-26 03:53 GMT

నెల్లూరు : నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. ఒక ట్రాన్స్‌జెండర్ కు బీఫార్మసీ విద్యార్థులు ఆపరేషన్ చేయడంతో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ లోని ఒక లాడ్జిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అలియాస్ అమూల్యగా పోలీసులు గుర్తించారు.

మర్మాయవాలు తొలగించి....
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన శ్రీకాంత్ ట్రాన్స్‌జెండర్ ఆపరేషన్ చేయించుకునేందుకు నెల్లూరు వచ్చారు. అక్కడ ఆక ఆసుపత్రిలో సంప్రదించగా తాము ఆపరేషన్ చేస్తామని ఇద్దరు బీఫార్మసీ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఒక లాడ్జిలో ఆపరేషన్ చేసి మర్మావయాలు తొలగించారు. వెంటనే శ్రీకాంత్ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News