మహిళను కాల్చి.. తనను తాను కాల్చేసుకున్న పోలీసు

చోదప్ లేప్చా ఇటీవల సెలవుపై వెళ్లి శుక్రవారమే తిరిగి విధుల్లో చేరాడు. తుపాకీ చేతబట్టి ఒక్కసారిగా రోడ్డుపైకి

Update: 2022-06-11 06:15 GMT

కోల్ కతాలో ఓ పోలీసు మహిళను కాల్చి.. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి సమీపంలోని పార్క్ సర్కస్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్మ్ డ్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చోదప్ లేప్చా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తుపాకీతో విచక్షణరహితంగా 10 నుంచి 15 రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఓ బుల్లెట్ దారినపోతున్న మహిళ లోకి దూసుకెళ్లింది. ఆ మహిళ బుల్లెట్ గాయంతో ప్రాణం విడిచింది. అనంతరం గడ్డం కింద తుపాకీ పెట్టుకుని ఆ కానిస్టేబుల్ తనను తాను కాల్చుకున్నాడని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

చోదప్ లేప్చా ఇటీవల సెలవుపై వెళ్లి శుక్రవారమే తిరిగి విధుల్లో చేరాడు. తుపాకీ చేతబట్టి ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకొచ్చిన అతను... పెద్దగా కేకలు వేస్తూ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన మరో వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ తుపాకీతో రోడ్డు మీదికి రాగా, అతడేదో బొమ్మ తుపాకీతో తమాషా చేస్తున్నాడని స్థానికులు భావించారు. ఆ తుపాకీ నుంచి బయటకు వచ్చిన బుల్లెట్లు ఓ కారును తాకగా, ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.
సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు గుమిగూడిన సెవెన్-పాయింట్ క్రాసింగ్‌కు కొన్ని వందల మీటర్ల దూరంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. హౌరాలోని దాస్‌నగర్‌కు చెందిన రిమా సింఘా చనిపోయిన మహిళగా గుర్తించారు. డ్యూటీలో ఉన్న పోలీసు తన సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్) నుండి కాల్పులు జరుపుతూ గందరగోళాన్ని రేకెత్తించడంతో ఆమెకు బుల్లెట్ తగిలింది. ఆమె అక్కడికక్కడే మరణించగా, అతడు మరికొన్ని రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. చోదప్ లేప్చా ఫస్ట్ బెటాలియన్ కు చెందిన ఆర్మ్ డ్ కానిస్టేబుల్ అని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


Tags:    

Similar News