Punganuru: పుంగనూరు బాలిక హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య కేసును

Update: 2024-10-06 11:59 GMT

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. రూ.3 లక్షల అప్పు ఈ హత్యకు కారణమని జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో రేష్మ, ఆమె తల్లి హసీనా, మైనర్ బాలుడు అఖిల్ ను అరెస్ట్ చేశారు.

బాలిక తండ్రి రేష్మ అనే మహిళకు రూ.3 లక్షలు అప్పు ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత అప్పు తీర్చాలని రేష్మపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఎంతకీ అప్పు చెల్లించకపోవడంతో బెదిరించాడు. కోర్టుకు లాగుతానని హెచ్చరించడంతో రేష్మ ఆ వ్యక్తిపై కక్ష పెంచుకుంది. రేష్మ బాలికను చంపాలని నిర్ణయించుకుంది. బాలికను ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. ఆ తర్వాత ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి, సమ్మర్ స్టోరేజి ట్యాంకులో పడేశారు. చిన్నారి మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, ఆమెను ముక్కు, నోరు మూసి హత్య చేశారని పోలీసులు వివరించారు. ఈ హత్యకు రేష్మ మరికొందరి సహకారం తీసుకుందని పోలీసులు తెలిపారు. చిన్నారి బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.


Tags:    

Similar News