ఆస్తికోసం భర్తను హత్యచేసి.. కర్ణాటకలో?

హైదరాబాద్‌కు చెందిన రమేశ్‌కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు.

Update: 2024-10-27 04:36 GMT

 nizamabad crime news

హైదరాబాద్‌కు చెందిన రమేశ్‌కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన కథనం భర్త రమేష్‌కుమార్‌ను ప్రియుడితో కలిసి హత్య భార్య హత్య చేసిందని తెలిసింది. రమేష్ కుమార్ ను ఆస్తి కోసమే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. న భువనగిరి ప్రాంతంలో హత్య చేసి శవాన్ని కర్ణాటకకు తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు.

భువనగిరి పోలీసుల కథనం ప్రకారం...
ప్రియుడు నిఖిల్ తో కలసి భార్య రమేశ్ కుమార్ ను హత్యచేసినట్లు భువనగిరి పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని ఓ కాఫీ ఎస్టేట్‌లో మృతదేహానికి నిప్పు పెట్టినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కాఫీ తోటలో కాలిన మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు గుర్తించారు. దాదాపు 8కోట్ల ఆస్తి కోసమే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్యకు సహకరించిన మరో నిందితుడు రాణాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News