తెలంగాణలో ఘోరం.. మృతదేహంతో సెక్స్ చేసిన కామాంధుడు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలోని ఓ తండాకు చెందిన భార్యాభర్తలు బతుకుదెరువు కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు..

Update: 2022-05-12 12:10 GMT

యాదాద్రి భువనగిరి : భర్త ఆమెతో పాటూ లేడని తెలుసుకుని ఆమెను అత్యాచారం చేయాలని అనుకున్నాడు. అయితే ఆమె ఎదురు తిరగడంతో దాడి చేసి చంపేశాడు. చివరికి చనిపోయిన ఆమెపై కూడా తన కామవాంఛ తీర్చుకున్నాడు. చివరికి చెప్పులు అతడిని పట్టించాయి. ఈ కామాంధుడికి ఎటువంటి శిక్ష విధించినా తప్పులేదని ప్రజలు అంటూ ఉన్నారు. అత్యాచారానికి పాల్పడి చంపేసి.. ఆమె కాళ్ల పట్టీలు, బంగారు పుస్తెలను దోచుకుని పారిపోయాడు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలంలోని ఓ తండాకు చెందిన భార్యాభర్తలు బతుకుదెరువు కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చారు. ఆరేళ్ల కింద వీరికి పెళ్లి అయింది. పిల్లలు లేరు. చౌటుప్పల్‌ మండలం తూప్రాన్‌పేట శివారులోని మూతబడిన ఓ నిర్మాణ పనుల గోదాంకు భార్య(28), భర్తలు వాచ్‌మెన్‌గా పనిచేస్తూ.. అక్కడే ఒక గదిలో ఉంటున్నారు. జీతం చాలకపోవడంతో భర్త.. సమీపంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా కూడా పనికి కుదుర్చుకున్నాడు. భార్య గోదాం వద్దే ఉండేది. ఎప్పటి లాగే భర్త సోమవారం డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీ ముగించుకుని రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. భార్య కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా పక్కనే ఉన్న బాత్రూం సమీపంలోని గడ్డివాము దగ్గర రక్తపు మడుగులో అర్ధ నగ్నంగా పడి ఉంది.
భర్త వెంటనే చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌లను రప్పించారు. మృతదేహాన్ని మంగళవారం ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెపై రెండుసార్లు లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. అయితే డెయిరీ లేబర్‌ రూముల్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి పనే అని పోలీసులు భావించారు. హరీష్‌గౌడ్ అనే పాతికేళ్ల యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చేశారు. భర్త లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో కొట్టి చంపి.. చనిపోయిన మహిళ పై అత్యాచారం చేశాడు. ఆమె ఒంటిపైనున్న నగలు, వెండి పట్టీలు తీసుకొని పారిపోయాడు.
గోదామ్‌లోకి వచ్చే ముందు పక్కనే ఉన్న తమ డెయిరీ లేబర్‌ గదులకు మధ్య ఉన్న గోడ దూకడానికి చెప్పులు వదిలి వచ్చాడు. మృతురాలి భర్త ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హత్య జరిగిన గోదామ్‌తో పాటు పక్కనే ఉన్న ప్రహరిగోడ దగ్గర సాక్ష్యాధారాల కోసం వెదుకుతుండగా నిందితుడు హరీష్‌గౌడ్ వదిలివెళ్లిన చెప్పులు దొరికాయి. వాటికి సిమెంట్‌ ఉండటంతో పక్కనే ఉన్న డెయిరీ లేబర్‌ రూంలో ఉన్న వ్యక్తులను విచారించారు. గిరిజన యువతిని హత్య చేసిన నిందితుడు కూడా అక్కడే ఉండటంతో అతడ్ని కూడా ప్రశ్నించారు పోలీసులు.
ఆ సమయంలో హరీష్‌గౌడ్‌ కాళ్లకు చెప్పులు లేకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించారు. హరీష్‌గౌడ్‌ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా మహిళను చంపి, అత్యాచారం చేసినట్లుగా అంగీకరించాడు. నిందితుడి దగ్గర మృతురాలి దగ్గర కాజేసిన నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచి నల్లగొండ జైలుకు తరలించారు. దారుణం జరిగిన 12 గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News