వ్యాన్ కు కరెంట్ షాక్.... 10 మంది మృతి

పికప్ వ్యాన్ కు షాక్ కు గురికావడంతో పది మంది ప్రయాణికులు మరణించారు.

Update: 2022-08-01 05:43 GMT

పికప్ వ్యాన్ కు షాక్ కు గురికావడంతో పది మంది ప్రయాణికులు మరణించారు. పశ్చిమబెంగాల్ లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటలనో పది మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బెహార్ లో కన్వర్ యాత్రికులతో వెళుతున్న ట్రక్ కు విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో వ్యానులో ఉన్న పది మంది ప్రాణాలు కోల్పోయారు. కన్వర్ నుంచి జల్పేష్ కు ట్రక్ వెళుతుంది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.

డీజే సిస్టమ్...
జల్పాయ్ గురి జిల్లా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలికి వచ్చి విచారణ ప్రారంభించారు. వ్యాన్ లో డీజే సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్ వైరింగ్ కారణంగానే ఈ షాక్ తగిలిందని చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణిచిన వారు శీతల్్కుచ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు చెబుతున్నారు.


Tags:    

Similar News