ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి

ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2022-03-16 01:47 GMT

ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఛత్తీస్‌ఘడ్ లోని గరియాబంద్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ట్రక్కు ఢీకొనడంతో అధిక సంఖ్యలో మృతి చెందారు.

అతి వేగమే...
జాతీయ రహదారిపై వస్తున్న ట్రాక్టర్, ట్రక్కు ఢొకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి యాభైవేల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.


Tags:    

Similar News