మావోల డంప్ లో రెండు వేల రూపాయల నోట్లు

చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హోరాహోరీగా ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నాయి

Update: 2024-08-13 12:48 GMT

చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హోరాహోరీగా ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. అయితే పోలీసుల మెరుపు దాడికి తాళలేక నక్సలైట్లు పరారయ్యారు. భారీగా ఆయుధాలతో పాటు 38 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

ఎన్ కౌంటర్ ...
నగదు డంప్‌లో పది లక్షల వరకు పాత 2వేల నోట్లు ఉన్నాయి. పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ పెద్దయెత్తున భద్రతాదళాలు చేపట్టాయి. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులు కూడా పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగే అవకాశముందని భావించి భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి.



Tags:    

Similar News