ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద రోహింగ్యాలు తమ దేశ జెండాను ఎగురవేశారంటూ జరుగుతున్న వాదన నిజం కాదు
రోహింగ్యా ముస్లింలు ప్రధానంగా బౌద్ధ మయన్మార్లో శతాబ్దాలుగా నివసిస్తున్నారు. అనేక తరాలుగా మయన్మార్లో రోహింగ్యాలు;

Palestine flag waved
రోహింగ్యా ముస్లింలు ప్రధానంగా బౌద్ధ మయన్మార్లో శతాబ్దాలుగా నివసిస్తున్నారు. అనేక తరాలుగా మయన్మార్లో రోహింగ్యాలు నివసిస్తున్నప్పటికీ వారికి సరైన గుర్తింపు లేదు. ఎప్పుడూ వివక్షను ఎదుర్కొంటూనే ఉనానరు. 1982 నుండి పౌరసత్వం లభించలేదు. దీని వలన వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వీరికి మయన్మార్లో ప్రాథమిక హక్కులు, రక్షణ లభించలేదు. దీంతో ఇతర దేశాలలో తలదాచుకోడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో భారీ హింస చెలరేగిన తర్వాత ఆగస్టు 2017లో రోహింగ్యాల వలస ప్రారంభమైంది. లక్షలాది మంది బంగ్లాదేశ్, భారతదేశంతో సహా ఇతర చుట్టుపక్కల దేశాలలో ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 40,000 మంది రోహింగ్యాలు భారతదేశంలోని జమ్మూ, హైదరాబాద్, ఢిల్లీ లలోని శిబిరాలలో నివసిస్తున్నారు. వారికి ఎటువంటి పత్రాలు లేవు.