జేసీ దివాకర్ రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి.. ఈ ఇల్లు తమదేనంటూ

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారు. సాహితీ లక్ష్మి నారాయణతో పాటు కొడుకు సాత్విక్ పై కేసు నమోదయింది.

Update: 2024-05-29 03:01 GMT

మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేశారు. సాహితీ లక్ష్మి నారాయణతో పాటు కొడుకు సాత్విక్ తదితరులపై ఫోర్జరీ కేసు నమోదయింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 62 లో దివాకర్ రెడ్డి ఇంటిని సాహితీ లక్ష్మీనారాయణ అద్దెకు తీసుకున్నారు. మూడేళ్ల గడువు ముగిసినా ఖాళీ చేయకుండా వేదింపులకు గురిచేస్తున్నాడు

మూడేళ్ల నుంచి....
దీంతో కోర్టు లో జేసీ దివాకర్ రెడ్డి పిటిషన్ వేశారు. జెసి దివాకర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి లక్ష్మీనారాయణ కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటికి అద్దెకు దిగి ఖాళీ చేయకుండా ఫోర్జరీ సంతకాలు చేయడంపై అతనిపై కేసు నమోదయింది.


Tags:    

Similar News