Telangana : నేడు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ

నేడు హైదరాబాద్‌లో రాజీన్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు

Update: 2024-09-16 02:19 GMT

నేడు హైదరాబాద్‌లో రాజీన్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట నిర్మించాలని ఎనిమిది నెలల క్రితం ఏర్పాటయిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పూర్తి చేశారు.

సచివాలయం ఎదుట...
అయితే ఈరోజు సాయంత్రం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విగ్రహం అక్కడ ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పోలీసుఅు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరినీ రానివ్వకుండా అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అనుమానం ఉన్న బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేసే అవకాశముంది.


Tags:    

Similar News