సెంచరీ కొట్టేసిన టమాటా.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి

ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. టమాటా ధర కిలో వంద రూపాయలకు చేరువలో ఉంది

Update: 2024-06-19 04:31 GMT

ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు వంద రూపాయలకు చేరువలో ఉన్నాయి. బయట మార్కెట్ లో కిలో టమాటా వంద రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. మరో వారం రోజుల్లో కిలో టమాటా ధర రెండు వందల రూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతులు తగ్గడంతో పాటు రాష్ట్రంలో దిగుబడులు కూడా తగ్గడంతో టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలు చేసేవారు కూడా తగ్గుతున్నారని, ధరను చూసి గతంలో కిలో కొనుగోలు చేసే వారు ఇప్పుడు పావు కిలో మాత్రమే కొనుగోలు చేస్తారని చెబుతున్నారు.

దిగుబడులు తగ్గి...
టమాటా లేకుండా వంటింట్లో ఏ కూర చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతుననాు. మొన్నటి వరకూ కిలో ముప్ఫయి రూపాయలు పలికిన టమాటా ధర నేడు కిలో వంద రూపాయలకు చేరుకోవడంతో కొనుగోలు చేయడానికి కూడా జంకుతున్నారు. కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. సాధారణంగా ఎండా కాలంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. కానీ వర్షాకాలంలోనూ కూరగాయలు ధరలు పెరగడం దిగుమతులు తగ్గడమేనని వ్యాపారులు చెబుతున్నారు. దిగుబడులు కూడా తగ్గడం కూడా ధరలు పెరగడానికి మరొక కారణంగా వ్యాపారులు చెబుతుండటం విశేషం.
ఉల్లి ధరలు కూడా...
ఆకుకూరలు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. నీటి ఎద్దడితో పంట చేతికి రాకపోవడంతో ఆకు కూరల ధరలు కూడా పెరిగిపోయాయి. మిర్చి కిలో ధర వందరూపాయలు దాటేసింది. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట కూడా అందకుండా పోవడంతో దిగుబడులు తగ్గిపోయాయని అంటున్నారు. ఇలా కూరగాయల ధరలతో పాటు ఉల్లి పాయల ధరల కూడా పెరిగిపోయాయి. ఉల్లిపాయల కిలో యాభై రూపాయలుకు పైగానే పలుకుతుంది. హైదరాబాద్ మార్కెట్ కు మహారాష్ట్ర నుంచి రావాల్సిన ఉల్లిపాయ దిగుమతులు తగ్గిపోయాయి. రాష్ట్రంలో ఉల్లి దిగుబడులు తగ్గడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రతి రోజూ వినియోగించే టమాటా, మిర్చి, ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News