కోవిడ్ కు ట్యబ్లెట్... 63 రూపాయలు మాత్రమే

కోవిడ్ కు కొత్తగా మాత్ర వచ్చేసింది. ఈ ట్యాబ్లెట్ ను ప్రముఖ ఔషధ సంస్థ ఆప్టిమన్ ఫార్మా రూపొందించింది

Update: 2021-12-31 04:06 GMT

కోవిడ్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కాస్త జలుబు, దగ్గు వస్తే వెంటనే పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. పరీక్ష ఫలితం వచ్చిన దాకా టెన్షన్ తప్పడం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ ను రెండు డోసులు వేసుకున్న వారిని కూడా ఈ భయం వీడటం లేదు. అయితే కోవిడ్ కు కొత్తగా మాత్ర వచ్చేసింది. ఈ ట్యాబ్లెట్ ను ప్రముఖ ఔషధ సంస్థ ఆప్టిమన్ ఫార్మా రూపొందించింది. దీనిని మూడు దశల్లో పరీక్ష చేశారు.

అన్నీ అనుమతులు....
ఈ ట్యాబ్లెట్ కు డీసీజీఐ అనుమతి కూడా ఇచ్చేసింది. ఈ సంస్థ ట్యాబ్లెట్ కు మోల్నుపిరావిర్ గా పేరుపెట్టింది. ఒక్కొక్క టాబ్లెట్ ధరను 63 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్క ప్యాకెట్ లో ఐదు స్ట్రిప్ లు ఉంటాయని, ఇందులో నలభై ట్యాబెట్లు ఉంటాయని సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ టాబ్లెట్ ను రోజుకు రెండు డోసులు వినియోగించాలని, కోవిడ్ నుంచి కోలుకుంటారని చెబుతున్నారు.


Tags:    

Similar News