రేపు లొంగిపోతా : అరవింద్ కేజ్రీవాల్

తాను రేపు తీహార్ జైలుకు వెళ్లి లొంగిపోతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు

Update: 2024-06-01 04:20 GMT

తాను రేపు తీహార్ జైలుకు వెళ్లి లొంగిపోతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

రేపు తీహార్ జైలుకు...
అయితే అరవింద్ కేజ్రీవాల్ తన ఆరోగ్యం బాగా లేదని, మధ్యంతర బెయిల్ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. ఆ పిటీషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో రేపు ఆయన తిరిగి తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News