భారీ ఎన్ కౌంటర్ .. 11 మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గడ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది

Update: 2024-07-02 12:37 GMT

ఛత్తీస్‌గడ్ లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పదకొండు మంది మావోయిస్టులు మరణించారు. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మరోసారి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.

పెద్ద సంఖ్యలో...
పదకొండు మంది మావోయిస్టులు మరణించారని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ధనంది - కుర్రేవాయ అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా వారికి ఎదురుపడటంతో కాల్పులు జరిగాయని చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నారు.


Tags:    

Similar News