నేడు పూరీ జగన్నాధయాత్ర

నేడు పూరీలోని జగన్నాధయాత్ర కొనసాగనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

Update: 2024-07-07 03:56 GMT

నేడు పూరీలోని జగన్నాధయాత్ర కొనసాగనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పూరీ జగన్నాధయాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. పూరీ జగన్నాధయాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది కావడంతో ఈ యాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయపరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి.

రెండు రోజుల పాటు...
పూరీ జగన్నాధయాత్ర రెండు రోజుల పాటు సాగనుంది. ఈరోజు, రేపు యాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్రలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నప్రసాదాలను, తాగునీటిని ఉచితంగా భక్తులకు అందచేస్తున్నారు.


Tags:    

Similar News