పొదల్లో పసికందు.. పోలీసు అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే?

పొదల్లో వదిలేసిన నవజాత శిశువును

Update: 2024-10-12 13:24 GMT

పొదల్లో వదిలేసిన నవజాత శిశువును స్థానిక పోలీసు అధికారి దత్తత తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఓ పసికందు అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమై పోలీసులను సంప్రదించారు. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పుష్పేంద్ర సింగ్‌ నేతృత్వంలోని దుధియా పీపాల్‌ పోలీసు ఔట్‌పోస్టు అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పాపను రక్షించారు. వైద్య పరీక్షల కోసం దాస్నా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె కుటుంబీకుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేసినా ఎలాంటి స్పందన రాలేదు.

శిశువు పరిస్థితి చూసి చలించిపోయిన సబ్-ఇన్‌స్పెక్టర్ పుష్పేంద్ర సింగ్, అతని భార్య రాశి నవజాత శిశువును దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దంపతులు తమ కుటుంబంలోకి శిశువును స్వాగతించడానికి చట్టపరమైన ప్రక్రియను పూర్తీ చేశారు. 2018లో ఈ బృందం వివాహం చేసుకుంది. వారికి పిల్లలు లేరు. దీంతో శిశువును దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దత్తత ప్రక్రియ ప్రారంభించామని, ప్రస్తుతం శిశువు పుష్పేంద్ర సింగ్ కుటుంబ సభ్యుల సంరక్షణలో ఉందని ఇన్‌స్పెక్టర్ అంకిత్ చౌహాన్ ధృవీకరించారు.


Tags:    

Similar News