YS Jagan In Delhi: ఇండియా కూటమి సపోర్ట్ సాధించిన వైఎస్ జగన్

ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

Update: 2024-07-24 11:32 GMT

ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మద్దతు పలికారు. జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన వీడియో, ఫొటో ఎగ్జిబిషన్ ను ఆమె సందర్శించారు. ఏపీలో ఎన్నికల తర్వాత ఏం జరుగుతోందో అందరికీ తెలిసేలా జగన్ మోహన్ రెడ్డి చేశారని, ఇలాంటి వాతావరణాన్ని సృష్టించినందుకు విజయసాయిరెడ్డికి కూడా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో ఢిల్లీకి తెలిసే పరిస్థితి లేదని.. ఇతర రాష్ట్రాలతో ఢిల్లీ ఎప్పుడో సంబంధాలు కోల్పోయిందన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ రాజకీయ హింస ఎక్కడ జరిగినా ఖండించాల్సిందేనని ప్రియాంక చతుర్వేది వివరించారు.

ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మీకు మద్దతుగా నిలుస్తాయని ప్రియాంక తెలిపారు. ఇది ఏపీలో మాత్రమే జరుగుతున్న హింస కాదు, మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇలాంటి దారుణాలు ఎదుర్కొనడంలేదని.. దేశమంతా ఇలాగే జరుగుతోందన్నారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక పరిణామాల పట్ల గవర్నర్ జోక్యం చేసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.

 

Tags:    

Similar News