తమిళనాడులో ఏఆర్ డెయిరీపై దాడులు

తిరుమల లడ్డూల తయారీలో కల్తీ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం ఏఆర్ డెయిరీ పై దాడులు నిర్వహిస్తుంది.

Update: 2024-09-20 12:16 GMT

 AR dairy in case of adulteration in making tirumala laddoos

తిరుమల లడ్డూల తయారీలో కల్తీ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం ఏఆర్ డెయిరీ పై దాడులు నిర్వహిస్తుంది. ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలోనే కల్తీ ఉందని, జంతువుల కొవ్వు, నాసిరకం నూనెలను వాడారని నివేదికలు కూడా రావడంతో టీటీడీ అధికారులు ఏఆర్ డెయిరీపై క్రిమినల్ కేసు కు సిద్ధమయింది.

ఏ విచారణ కైనా?
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఏఆర్ డెయిరీపై దాడులు నిర్వహిస్తుంది. మరో వైపు ఏఆర్ డెయిరీ కూడా దీనిపై వివరణ ఇచ్చింది. తాము ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. తమ డెయిరీలో ఎలాంటి నాసిరకం పదార్థాలను వాడలేదని తెలిపింది. తాము స్వచ్ఛమైన నేతినే సరఫరా చేశామని ఏఆర్ డెయిరీ చెప్పింది.


Tags:    

Similar News