UPSC ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు తేజాలు

ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించగా.. హెచ్ ఎస్ భావన..

Update: 2023-05-23 09:59 GMT

upsc cse 2022 final results

UPSC-2022 తుది ఫలితాలు కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో 345 మంది జనరల్ కోటాలో, 99 మంది ఈడబ్ల్యూఎస్ నుంచి, 263 మంది ఓబీసీ నుంచి, 154 మంది ఎస్సా నుంచి, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్ సర్వీసుకు 38, ఐపీఎస్ కు 200 మంది ఎంపికయ్యారు.

సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్ లో 131 మంది ఎంపికయ్యారని యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా యూపీఎస్సీ ఫలితాల్లో అమ్మాయిలే సత్తా చాటారు. టాపర్ గా ఇషితా కిశోర్ నిలిచింది. యూపీఎస్సీ 2022 ఫలితాల్లో ఇషితా ఆలిండియా ఫస్ట్ ర్యాంకులో ఉండగా .. గరిమ లోహియా, ఉమా హాథిన్, ఎన్. స్మృతి మిశ్రా 2,3,4 ర్యాంకుల్లో నిలిచారు.
ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించగా.. హెచ్ ఎస్ భావన 55వ ర్యాంకు సాధించారు. శాఖమూరి శ్రీసాయి అర్షిత్ 40, ఆవుల సాయికృష్ణ 94, నిధి (హైదరాబాద్)110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్ కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, విశాఖకు చెందిన సాహిత్య 243, అంకుర్ కుమార్ 257, బొల్లం ఉమామహేశ్వర్ రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్థన్ 292, గ్రంథె సాయికృష్ణ 293, లక్ష్మి సుజిత 311, చేతనా రెడ్డి 346, శృతి 362, సుష్మిత 384, రేవయ్య 410, సీహెచ్ శ్రావణ్ కుమార్ 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో మెరిశారు.


Tags:    

Similar News