ఛత్తీస్ ఘడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్

ఛత్తీస్ ఘడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదు గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం;

Update: 2025-03-25 06:21 GMT
encounter, five maoists died, police, chhattisgarh
  • whatsapp icon

ఛత్తీస్ ఘడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఐదు గురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. భద్రతాదళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో...
ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో గత కొంత కాలంగా మావోయిస్టుల కోసం కూంబింగ్ జరుగుతుంది. భద్రతాదళాలు అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఎండా కాలం కావడంతో పాటు తాగునీరు దొరకక మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు వస్తుండటంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మావోయిస్టులు దాదాపు ఎనభై మంది పైగానే మరణించారని పోలీసులు తెలిపారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని తెలిసింది.


Tags:    

Similar News