ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత మృతి
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల అగ్రనేత మృతి చెందినట్లు సమాచారం.;

ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల అగ్రనేత మృతి చెందినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. అయితే ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సుధీర్ సుధాకర్ మృతి చెందినట్లు ప్రచారం జరుగుతుంది. మృతి చెందిన ఐదుగురు మావోయిస్టుల్లో అగ్రనేత ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కోటి రూపాయల రివార్డు...
మావోయిస్టు సుధీర్ పై కోటి రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. దీంతో ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో హై అలెర్ట్ ను ప్రకటించారు. ఇప్పటికీ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రతాదళాలతో పాటు పోలీసులు సంయుక్తంగా అడవి మొత్తం జల్లెడ పడుతున్నాయి.