Telangana Budget : తెలంగాణ వార్షిక బడ్జెట్ 3,04,965 కోట్లు

తెలంగాణలో 2025 - 2026 ఆర్థిక సంవత్సరానికి మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు;

Update: 2025-03-19 05:56 GMT
mallu bhatti vikramarka, finance minister, budget, telangana
  • whatsapp icon

తెలంగాణలో 2025 - 2026 ఆర్థిక సంవత్సరానికి మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమంగా పరుగులు పెట్టించడంలో తమ ప్రభుత్వం సక్సెస్ అయిందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజలు తమను నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని ఎవరి కోసమూ తాకట్టు పెట్టకుండా ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తూ జవాబుదారీ తనంతో పాలన అందిస్తున్నామని తెలిపారు. గత దశాబ్దకాలంలో పాలన పరంగా విధ్వంసమైందని, దానిని గాడిలో పెడుతూ దీర్ఘకాలిక ప్రయోజనాలను, లక్ష్యాలను ఉంచుకుని తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిపై నిరాధార ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని, వారి కుట్రలను సమర్ధవంతంగా తిప్పుకొడుతూ పాలనను ముందుకు తీసుకెళుతున్నామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎప్పటికప్పుడు సత్యాలు ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు.

మూడు అంశాలతో...
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు అంశాలను నమూనాగా తీసుకుని దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు. వెయ్యి ట్రిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా తమ పాలన పరుగులు తీస్తుందని మల్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మూసీ రివర్ ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. పరిశ్రమల స్థాపనలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు. విద్య, వైద్య రంగాలను అందుబాటులో ఉంచుతూ వారికి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే తమ ప్రభుత్వం రైతురుణ మాఫీ, రైతుభరోసా, మార్కెటింగ్ సౌకర్యాలు వంటివి కల్పిస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క వివరించారు.
కేటాయింపులు ఇలా...
నిరుపేదలు, బలహీన వర్గాల కోసం అభివృద్ధి ఫలాలు అందాలని సంక్షేమ రంగానికి తగినన్ని నిధులను కేటాయింపులు చేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. 3,04,965 కోట్ల తెలంగాణ వార్షిక బడ్జెట్ గా నిర్ణయించారు. రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్ల రూపాయలుగా చూపించారు. తలసరి ఆదాయాన్ని 3,79,751 కోట్ల రూపాయలుగా బడ్జెట్ అంచనాల్లో చూపారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తుందని అన్నారు. వ్యవసాయ శఆఖకకు 24,439 కోట్ల రూపాయలు కేటాయించింది. విద్యకు 23,108 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 31, 035 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 40 వేల కోట్ల రూపాయలను కేటాయించింది.



Tags:    

Similar News