ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది.;

Update: 2025-02-25 11:56 GMT
campaign,  mlc elections,  andhra pradesh, telangana
  • whatsapp icon

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల 27వ తేదీన ఎన్నిక జరగనుంది. ఇక ఏపీలో గుంటూరు, కృష్ణా జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఏపీలోనూ...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరోజు ఆ జిల్లా పరిధిలో ప్రభుత్వ టీచర్లకు సెలవు ప్రకటించారు.


Tags:    

Similar News