Hyderabad : చంద్రబాబుకు రేవంత్ ముందరకాళ్లకు బంధం

ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభంలో ప్రజా భవన్ కు వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించారు.

Update: 2024-07-06 13:27 GMT

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభంలో ప్రజా భవన్ కు వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాలువతో సన్మానించారు. ఈసందర్భంగా కాళోజీ రచించిన "కాళోజీ నా గొడవ" అనే పుస్తకాన్ని బహిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఆయనకు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి తమ మనసులో మాటను చెప్పకనే చెప్పినట్లయిందని అంటున్నారు.

కాళోజీ పుస్తకం బహుకరణ...
తెలంగాణ సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని కోరుతూ చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పుస్తకాన్నే మరీ ఎంచుకుని బహుకరించారంటున్నారు. కాళోజీ రాసిన పుస్తకంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉదహరించడంతో సింబాలిక్ గా అదే పుస్తకాన్ని ఇచ్చి సమావేశానికి ముందే ఈ సమావేశంలో తమ ప్రాధాన్యతలు ఏమిటో రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News