Telangana : హైదరాబాద్ కు మరో వరం.. బీవైడీ త్వరలోనే ప్రారంభం
చైనా విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ బీవైడీ హైదరాబాద్ లో విద్యుత్తు కార్ల యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది;

ఆంధ్రప్రదేశ్ లో కియా కార్ల పరిశ్రమ ఉంటే అందుకు తగినట్లుగా తెలంగాణ ప్రభుత్వం బీవైడీ కార్ల పరిశ్రమను తేనుంది. తెలంగాణకు మరో ప్రతిష్టాత్మకైన కంపెనీ రాబోతుంది. దీంతో ఉపాధి అవకాశాలు పెద్దయెత్తున లభించనున్నాయి. చైనా విద్యుత్తు కార్ల తయారీ కంపెనీ బీవైడీ హైదరాబాద్ లో విద్యుత్తు కార్ల యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంస్థను తీసుకు వచ్చేందుకు గత కొంతకాలంగా ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఇక్కడ ఉన్న అనుకూల వాతావరణం, కార్ల అమ్మకాలు వంటివి పరిగణనలోకి తీసుకుని బీవైడీ కంపెనీ హైదరాబాద్ సమీపంలో కార్ల యూనిట్ ను స్థాపించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేసినట్లు అధికారికవర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.