Congress : గెలుపు ఫారాలు తీసుకోగానే... నేరుగా తాజ్‌కృష్ణకు.. కాంగ్రెస్ ప్లాన్ ఇదే

రేపు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి అభ్యర్థి వద్ద ఒక పరిశీలకుడిని నియమించింది.

Update: 2023-12-02 04:15 GMT

రేపు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి అభ్యర్థి వద్ద ఒక పరిశీలకుడిని నియమించింది. గెలిచిన తర్వాత గెలుపు ఫారం పొందిన అభ్యర్థిని నేరుగా తాజ్‌కృష్ణకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంది. అక్కడి నుంచి క్యాంప్ కు తరలించాలా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాకున్నా గెలిచిన అభ్యర్థులందరీనీ తాజ్‌కృష్ణకు తెచ్చి అక్కడి నుంచి క్యాంప్ కు వెళ్లే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ రూపొందించిందని తెలుస్తోంది.

సీఎల్పీ సమావేశం వరకూ...
పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినా సీఎల్పీ సమావేశం జరిగే వరకూ తాజ్ కృష్ణ హోటల్ లోనే ఉంచుతారు. మెజారిటీ కాస్త అటు ఇటుగా వస్తే అభ్యర్థులను కర్ణాటకకు తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మొత్తం బాధ్యతను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అప్పగించింది. ఆయన రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పడు అంచనా వేసి హైకమాండ్ కు తెలియజేస్తూ తక్షణ నిర్ణయాలను తీసుకునేలా ఏర్పాట్లు చేసుకుంది. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న పూర్తి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది.


Tags:    

Similar News